Wednesday 31 January 2018

Jaafraa ginjalu ( anota )

జాఫ్రా గింజలను ఏం చేస్తారు...
జాఫ్రా గింజల నుంచి సహజసిద్ధమైన సింధూర రంగు వస్తుంది. దీనిని ఐస్‌ క్రీమ్‌లు, మాంసాహారం, సుగంధద్రవ్యాలు, వెన్న, జున్ను, మిఠాయిలు, శీతల పానీయాలు, పప్పుధాన్యాలు, బియ్యంతో తయారుచేసే వంటకాల్లో సేంద్రీయ రంగుగా ఉపయోగిస్తారు. అలాగే వస్త్రాలు, సౌందర్య సాధనాలు, సబ్బులు, చెప్పుల పాలిష్‌, నెయిల్‌ పాలిష్‌, హెయిర్‌ ఆయిల్స్‌ తయారీలో కూడా వినియోగిస్తున్నారు. అంతేకాక జాఫ్రాలో మంచి ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నట్టు నిపుణుల అఽధ్యయనంలో వెల్లడయ్యింది. జాఫ్రా గింజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కెరోటినాయిడ్లు అధికంగా వున్నాయి. ఈ చెట్టు బెరడును ఆయుర్వేద వైద్యంలో గనేరియా వ్యాధి నివారణకు, వితనాల గుజ్జును బంక విరేచనాలను అరికట్టేందుకు, ఆకులను పాముకాటు విషం విరుగుడుకు, పచ్చకామెర్ల నివారణకు ఉపయోగిస్తున్నారు. జాఫ్రా గింజలతో బహుళ ప్రయోజనాలు వుండడంతో పలు దేశాలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. మన్యంలో వీటిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసి ఎగుమతి వ్యాపారులకు సరఫరా చేస్తుంటారు. 

Sunday 28 January 2018

jalubu taggataniki

గోరువెచ్చగా ఉండే ఫ్లూయిడ్లు తీసుకుంటే శరీరానికి ఎంతో సాంత్వనగా ఉంటుంది. వేడి ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన నెమ్ము కరుగుతుంది.
వెల్లుల్లి లేదా అల్లం వేసి తయారుచేసిన కాయగూరల సూప్‌ను వేడిగా తాగితే మంచిది. దీని వల్ల ఊపిరితిత్తుల్లోని శ్లేష్మం తగ్గుతుంది.
ఆర్గానిక్‌ బెల్లం, అల్లం రసం చుక్కలు, కచ్చాపచ్చాగా చేసిన నల్ల మిరియాల పొడి, పిప్పలి (లాంగ్‌ పెప్పర్‌) వేడి నీళ్లల్లో వేసి తాగితే ఊపిరితిత్తులకు మంచిది.
పసుపులో ఉండే కుర్‌క్యుమిన్‌ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తాజా పసుపు వేళ్ల నుంచి తీసిన రసాన్ని వేడి సూప్స్‌లో కలుపుకుని తాగితే మంచిది.
ఉల్లిపాయరసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగినా లేదా పచ్చిఉల్లిపాయమీద నిమ్మరసం పిండుకుని తిన్నా ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం కరిగిపోతుంది.
ఒక కప్పు వేడినీళ్లల్లో టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపి తాగితే కూడా నెమ్ము పోతుంది.
కృత్రిమమైన, రసాయన ఆరోమా స్ర్పేలను ఇంట్లో పెట్టొద్దు.

Friday 26 January 2018

Jonna idli

యారీ విధానం..
జొన్న ఇడ్లి తయారీకి ముందుకు ఒక కప్పు మినప పప్పు, రెండు కప్పుల జొన్నల రవ్వ తీసుకోవాలి. ముందురో జు రాత్రికి 4గంటల ముందు మినప పప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. జొన్నలను రవ్వ మాదిరి దంచుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ రెండు మిశ్ర మాలను రాత్రికే నానబెట్టాలి. ఉదయం మామూలు ఇడ్లి మాదిరిగానే వేసుకుం టే జొన్నఇడ్లి సిద్ధమవుతుంది.
 
ఉపయోగాలు..
పైబర్‌, గ్లూటీన్‌ ఫ్రీ ఉండడం వల్ల ఎముకలకు బలం, కాళ్లకు ఎంతో ఉప యోగకరం. ప్రోటిన్స్‌, పీచు పదార్థం అధికంగా ఉండడంతో ప్యాట్‌ను తగ్గించుకో వచ్చు. ఐరన్‌, క్యా ల్షియం, పాస్పరస్‌, మినరల్స్‌ పుష్క లంగా ఉంటాయి. ఎముకలు గుళ్లబా రకుండా పని చే స్తాయి. జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. గుండె ను పదిలంగా ఉంచుతూ రక్తహీనత లేకుండా చూస్తుంది. ఒక కప్పు జొన్న లో క్యాలరీస్‌-651, కార్బోహైడ్రేట్స్‌- 143 గ్రా., ప్రొటీన్స్‌-21.7గ్రా., ఫైబర్‌-12గ్రా., ఫ్యాట్‌ - 6.3గ్రా., మెగ్నీషియం - 316.8 మి.గ్రా., పాస్పరస్‌ - 551 మి.గ్రా., క్యా ల్షియం - 53.8 మి.గ్రా., ఐరన్‌ - 8.4 మిల్లీ గ్రా ములు ఉంటా యి. ఇవన్నీ డ యాబెటీస్‌ రా కుండా అడ్డు కుంటాయి. జొ న్న ఇడ్లి రూచి గా ఉంటుంది.

Mokka Jonnalu Corn Flakes







మక్క కంకులు
 మక్క కంకులు అతి చౌకగా లభించే బలమైన ఆహారం. వీటి గింజలను పచ్చిగా, ఉడక బెట్టు కుని, కాల్చుకుని తినవచ్చు. మక్క గింజల్లో లినోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఈ, బి1, బి6, నియాసిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, రిబోఫ్లోవిన్‌  ఎక్కువగా లభిస్తాయి. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా ఉపకరిస్తుంది. పీచు అధికంగా ఉండడంతో మలబద్ధకాన్ని నిలువరించి, మొలలు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ను అరికడుతుంది. మక్క ల్లో కావల్సినన్ని మినరల్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, పాస్ప రస్‌లాంటివి ఎక్కువగా ఉండి ఎము కలకు బలాన్నిస్తాయి.  మక్క కంకు ల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. కంకులు అధికంగా తినేవారిలో రక్తహీనత కనపడదు. విటమిన్‌ సీ, కెరోటియాయిడ్లు, మయో ప్లేమినాయిడ్లు చెడు కొలెస్టాల్‌ లేకుండా చేసి గుండెకు బలాన్ని ఇస్తాయి. మొక్కజొన్నలో ఉం డే ఫోలిక్‌ యాసీడ్‌ గర్భిణులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్లు చేతు లు వాపులు రాకుండా ఉపయోగపడుతుంది

రక్తహీనతను తగ్గిస్తుంది
మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. రక్తహీనత (ఎనీమియా) ముప్పు రాకుండా తగిన మోతాదులో న్యూట్రియంట్లను సరఫరా చేయడంలో మొక్కజొన్న దోహదం చేస్తుంది. ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా 125 క్యాలరీలు, 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 4 గ్రాముల ప్రొటీన్లు, 9 గ్రాముల సూక్రోజు,  రెండు గ్రాముల కొవ్వు, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ లభిస్తుంది.

శక్తికారకం
అథ్లెటిక్‌ క్రీడాకారులకు, జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1, బి5లతో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది.  మొక్కజొన్నలో ఉండే కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సేపు శక్తిదాయకంగా ఉంటుంది. ఒక కప్పు గింజల ద్వారా లభించే  కార్బొహైడ్రేట్లు కేవలం శారీరక శక్తిని పెంపొందించడానికే కాదు మెదడు, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా తోడ్పడుతుంది. అందువల్ల తరచూ ఆహారంలో మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మొక్కజొన్నలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు పొటాషియం, కాల్షియం కూడా తగు పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల బీపీ, గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది. సోడియం (ఉప్పులో ఒక భాగం) తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి, రక్తపోటు ఉన్నవారికి మొక్కజొన్న ఎంతో ఆరోగ్యకరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. 

బరువు పెరగడానికి
వయసు, ఎత్తుకు తగ్గ బరువు లేనివారి విషయంలో మొక్కజొన్న దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. బరువు తక్కువ ఉన్నవారు ఆందోళన చెందనవసరం లేదు. జంక్‌ ఫుడ్‌ తింటే వచ్చే బరువు దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. మొక్కజొన్నతో అటువంటి పరిస్థితి రాదు. తరచూ ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూసుకుంటే ఆరోగ్యకరమైన క్యాలరీలతో పాటు విటమిన్లు, తగిన పరిమాణంలో ఫైబర్‌ కూడా శరీరానికి అందుతాయి.

మధుమేహులకూ మంచిదే
మొక్కజొన్నలో స్వీట్‌ కార్న్‌ రకం ఉంటుంది. స్వీట్‌ కార్న్‌, స్వీట్‌ కార్న్‌ ఆయిల్‌ రెండూ శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు రక్తంలో కొలెస్టారాల్‌ శోషణను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.  అందువల్ల మధుమేహంతో బాధపడేవారికి మొక్కజొన్న ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ కూడా మధుమేహం సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మేలు చేస్తుందని ప్రకటించింది. రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూడాలని వైద్యులు చెబుతున్నరు. విటమిన్‌ బి1, బి5, విటమిన్‌ సి సమృద్ధిగా ఉండటంవల్ల వ్యాధులపై పోరాడటంలో ఉపయోగం ఉంటుంది. కొత్త రక్త కణాల ఉత్పత్తికి  కూడా దోహదం చేస్తున్నందున రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి. మధుమేహులకు ఇది మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

గర్భిణులకు మేలు
గర్భందాల్చినవారికి మొక్కజొన్న చేసే మేలు ఇంతా అంతా కాదు. గర్భిణికి, గర్భస్త శిశువుకు కూడా మొక్కజొన్న వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో ఫోలిక్‌ యాసిడ్‌, జిక్సాన్‌తిన్‌, పాథోజెనిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉండటం వల్ల శిశువుకు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించవచ్చు. మొక్కజొన్నలో పీచు అధికంగా ఉండటం వల్ల సాధారణంగా గర్భిణులకు వచ్చే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది.‍

చర్మం ఆరోగ్యంగా
మొక్కజొన్నలో విటమిన్లు, లైకోపిన్‌ (యాంటి ఆక్సిడెంట్లు) పుష్కలంగా ఉంటాయి. దీంతో కొలిజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా యూవీ కిరణాల జనిత ఫ్రీ రాడికల్స్‌తో చర్మానికి హాని కలుగకుండా నివారిస్తుంది. సౌందర్య కారక ఉత్పత్తుల్లో మొక్కజొన్న గింజల నుంచి తయారు చేసే నూనెను వినియోగిస్తారు. అందువల్ల మొక్కజొన్నను చిరుతిండిగా, ఛాట్‌, సూప్‌ తదితరాల్లో చేర్చుకుని హాయిగా తినొచ్చు.

క్యాన్సర్‌ రాదు
మొక్కజొన్న గింజల్లో సమృద్ధిగా కెరొటినాయిడ్స్‌ ఉంటాయి. దీని వల్ల నేత్ర సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.   దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ ఫోలిక్‌ యాసిడ్‌ అన్నిరకాల క్యాన్సర్లకు నిరోధకంగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక, మొండి వ్యాధుల నివారణ మందుల తయారీలోనూ మొక్కజొన్న వినియోగం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును నివారించేందుకు ఉపయోగపడే ఎమినో యాసిడ్స్‌  తూతెయిన్‌, జీక్జాన్‌డిన్‌ మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంతేకాదు లినోలిక్‌ యాసిడ్, రిబోఫ్లావిన్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ మీద ప్రభావం చూపుతాయి. రక్తలేమిని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. చిన్న ప్రేగుల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం రానీయదు. కొలెస్టారాల్‌ నియంత్రిస్తుంది. అంతేకాదు మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.  వయసు పెరుగుదలతో వచ్చే దుష్ప్రభావాలను  నివారిస్తుంది.




పసుపు curcumin

మనం తినే ప్రతీ కూరలో పసుపు కచ్చితంగా ఉంటుంది. సూక్ష్మజీవి నాశనిగా, శోథ నిరోధకంగా పనిచేసే పసుపుతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు. ఐరన్‌, కాల్షియం, పొటాషియం, విటమిన్‌-సీ.. ఇలా బోలెడన్ని పోషకాలు దీని సొంతం. దెబ్బ తాకి రక్తం కారితే ప్రథమ చికిత్సగా పసుపునే వాడతాం. ఈ ఉపయోగాలే కాదు.. అల్జీమర్స్‌ వ్యాధిని కూడా దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంచే దివ్యౌషధంగా పసుపు పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. మనసు ప్రశాంతంగా ఉండటానికీ దోహదం చేస్తుందట. పసుపుపై పరీక్షలు చేసిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు.. దానిలోని పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయని గుర్తించారు.

Thursday 11 January 2018

Mulaga Drumsticks

బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్‌ ఇచ్చే ఆకు.. పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్‌ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌సి ఇచ్చే ఆకు.. అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు..

 అదే.. మునగాకు. ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే.. అదో ఔషధాల నిధి. పోషకవిలువల గని.

మునగను ఇంగ్లిషులో మోరింగా అని అంటారు. ఇది మురుంగై అనే తమిళ పదం నుంచి వచ్చింది. తమిళనాట దీనిని విస్తారంగా సేద్యం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం తమిళనాట దాదాపు లక్ష పైచిలుకు ఎకరాల్లో మునగ సాగవుతోంది. అక్కడి నుంచి మునగాకు, పొడి, విత్తనాలను అమెరికా ఎక్కువగా కొంటోంది. విదేశాలు వీటిని కాస్మెటిక్స్‌లోనూ, ఔషధాల తయారీలోనూ వాడుతున్నారని చెబుతున్నారు తమిళనాడు కు చెందిన మునగ ఎగుమతి కంపెనీ ఎస్‌వీఎం ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఎస్‌ ముత్తురాజ్‌. తమిళనాడులోనే కాదు.. ఏపీ, కర్ణాటక, ఒడిసాతో పాటు హిమాలయా పర్వత పాదాల వద్ద ఈ చెట్లు పెరుగుతాయి. ఘనా, మొజాంబిక్‌, నైజీరియా, కెన్యా, రువాండా, నైగర్‌, కంబోడియా, హైతీ, ఫిలిప్పీన్స్‌లోనూ మునగ పెరుగుతున్నది.

మునగ.. పాశ్చాత్యలకు ఇది మేజికల్‌ ట్రీ. మన దగ్గర.. ‘అమ్మకు ప్రియనేస్తం’. ఎన్నో పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా.. కనీసం ఆషాఢంలోనైనా తినాలన్నారు పెద్దలు! ఒక్క ఆషాఢం అనే ఏంటి.. తరచూ తినాల్సిన ఆకు అని ఆధునిక వైద్యనిపుణులు అంటున్నారు. అల్లోపతి, ఆయుర్వేదాలు రెండింటిలోనూ మునగకు విశిష్ట స్థానం ఉంది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు.
మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి.. ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాల డ్యామేజి జరక్కుండా చూస్తాయి.. యాంటాసిడ్‌గా మునగాకు గ్యాస్ట్రిక్‌ అల్సర్లను నయం చేస్తుంది. ఊబకాయం, మధుమేహానికి మంచి మందు. కేన్సర్‌ చికిత్సలోనూ దీని పాత్రను ఇపుడిపుడే అంచనా వేస్తున్నారు. కండరాల నొప్పి, క్షీణతకు తగిన మందు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల నిద్ర సరిగా పట్టేట్టు చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి, లివర్‌ సిరోసి్‌సకు ఇది అద్భుతమైన మందు అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. 200 మిల్లీ గ్రాముల మునగాకు పొడి తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ దాదాపు 40ు తగ్గుతాయి. లైంగిక సామర్థ్యం పెరగడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది, తినడానికి ఘాటుగా ఉన్నా ఇది పరమౌషధం.


వంద గ్రాముల మునగాకులో
ఏమేం పోషకాలుంటాయంటే..
మాంసకృత్తులు: 8.3 గ్రాములు
కాల్షియం: 434 మిల్లీగ్రాములు
పొటాషియం: 202 మిల్లీగ్రాములు
విటమిన్‌ ఎ: 738 మిల్లీగ్రాములు
విటమిన్‌ సి: 164 మిల్లీ గ్రాములు
పీచుపదార్థాలు: 19.2 గ్రాములు

నీటి కాలుష్యం.. ప్రాణాలను హరించే పెనుముప్పు! భూగర్భజలం, ఇతర నీటి వనరులు.. దాంట్లో నీరు శుభ్రంగానే ఉండొచ్చు. కానీ, అందులో కనిపించని ఎన్నో మూలకాలు.. మలినాలు.. అనేకానేక హానికారక బ్యాక్టీరియాలు (ఈ-కొలి తదితర వర్గాలు) ఉంటాయి. అవి కేన్సర్‌కు కారకాలు కావొచ్చు.. వాటివల్ల కలరా రావొచ్చు.. లేదంటే ఎముకలు ఒంగిపోయి ఒళ్లు వంకరా అవ్వొచ్చు! అందుకే ఆ మలినాల్లేని శుద్ధమైన నీటిని తాగేందుకు.. వాడేందుకు జనాలు ‘ఫిల్టర్‌’ నీటిపై ఆధారపడుతున్నారు. పుట్టగొడుగుల్లా నీటిశుద్ధి ప్లాంట్లూ వెలసి బోలెడంత వ్యాపారమవుతోంది. డబ్బున్నోళ్లయితే ఇంట్లోనే ఎలకా్ట్రనిక్‌ నీటిశుద్ధి ఫిల్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, ఎన్ని ఆక్వాగార్డ్‌లుండనీ... ప్యూరిట్‌లు ఉండనీ.. అవన్నీ కృత్రిమమే.. తాత్కాలికమే! మరి సహజసిద్ధంగా.. చౌకగా నీటిని వడకట్టే మార్గం ఉందా అని అన్వేషిస్తే.. దొరికే సమాధానం.. పప్పుచారు.. కూరలు.. పప్పుల్లో మనం ఎంతో ఇష్టంగా తినే మునగకాయలు!
చాలాకాలంగా పటిక, ఇండెపు గింజలాంటి వాటితో నీటిని శుద్ధి చేస్తున్నా.. ఇంకా అందుబాటులో ఉండే మార్గాల కోసం శాస్త్రవేత్తలు వెదికారు.. ప్రయత్నించారు. దీనిపై అంతర్జాతీయంగా చేసిన పరిశోధనల ఫలితాల్లో మునగ ఆశ్చర్యకర ఫలితాలనిచ్చింది. నీళ్లలోని హానికారక బ్యాక్టీరియాలను మునగ గింజల పొడి నాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మునగలో ఉండే మొరింగా ఓలీఫెరా కాటియోనిక్‌ ప్రొటీన్‌ (ఎంవోసీపీ).. నీటిని శుద్ధిచేస్తుంది. గింజల పొడిని నీటిలో కలిపితే.. నీటిలోని ఘనపదార్థాలతో పాటు అడుగుభాగానికి చేరిపోతుంది. తద్వారా నీటిని ఆ ప్రొటీన్‌ శుద్ధి చేస్తుంది. దాదాపు 90-99 శాతం వరకు బ్యాక్టీరియా అంతు చూస్తుంది. అయితే, నీళ్లలో మాత్రం కొన్ని మూలకాలు.. సేంద్రియ పదార్థాలుంటాయి కాబట్టి.. అది చనిపోని బ్యాక్టీరియాకు ఆహారంగా మారి మళ్లీ బ్యాక్టీరియా వృద్ధిచెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎంవోసీపీని ఇసుకతో కలిపి నీటిని శుద్ధిచేస్తే.. ఆ సేంద్రియ పదార్థాన్ని సులభంగా తీసేయొచ్చంటున్నారు పరిశోధకులు. కాగా, పూర్వం ఈజిప్షియన్లూ మునగ విత్తనాల పొడిని కుండల లోపల రాసేవాళ్లు. అయితే అన్ని కాలాల్లో లభించే మునగకాయల గింజలు అందుకు అనువుగా ఉండవట. వర్షాకాలంలో కాసిన మునగకాయల్లోని గింజలైతే సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వానాకాలపు గింజలను సేకరించి, వాటిని పొడి చేసి ఏ కాలంలోనైనా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. దాని కోసం మునగసాగును భారీగా చేపడితే ఇటు రైతుకు ఆదాయంతో పాటు... నీటి శుద్ధికి సహజ మార్గం చూపినట్లవుతుందన్నది నిపుణుల మాట! మునగ గింజలే కాదు.. మునగ ఆకుకూ క్రిములను చంపే శక్తి ఉందని చెబుతున్నారు.


మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. 
భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు. 
ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి. ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌, డాక్టర్‌ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.
ఏముంది మునగాకులో..? 
 ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే... 
వంద గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి. 
అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి. 
అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. 
 ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే. 
నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే... 
100 గ్రా. ఎండిన ఆకుల్లో... పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌... ఇలా చాలా లభిస్తాయి. 
మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.

అతి తక్కువ ఖర్చుతో నీటి శుద్ధీకరణకు మునగ గింజలు దోహదపడతాయని అమెరికాలోని కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. భారత్‌లోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే మునగ చెట్ల నుంచి వచ్చే గింజల ద్వారా.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది జనాభాకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే అవకాశం ఉందని ఆ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. వీరు తయారు చేసిన ఫిల్టర్‌కు ‘ఎఫ్‌-సాండ్‌’ అని నామకరణం చేశారు. పట్టణాల్లో మునిసిపల్‌ విభాగాలు నిర్వహించే వాటర్‌ ఫిల్టర్‌ బెడ్‌లలో ‘ఎఫ్‌-సాండ్‌’ ద్వారా నీటి శుద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఫిల్టర్‌లో ఇసుక ద్వారా బురద నీరు శుద్ధి అవుతుందని.. మునగ గింజల్లో ఉండే ఎంఓ2.1 అనే ప్రొటీన్‌, కరిగే సేంద్రీయ కర్బనాలు (డీఓసీ), ఇసుకలో ఉండే సిలికాన్‌ల సమ్మిళితంతో.. బురద నీటిలో ఉండే సూక్ష్మజీవులు, కలుషితాలు పూర్తిస్థాయిలో దూరమవుతాయని వివరించారు. ఐక్య రాజ్య సమితి నివేదిక మేరకు ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల మందికి కలుషిత నీరే దిక్కని.. ‘ఎఫ్‌-సాండ్‌’తో వీరందరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చని పరిశోధకులు తమ పరిశోధన పత్రాల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.







Groundnuts . Groundnut is rich in protein, which makes up 26 - 28 percent of its nutrient content. It is higher than in eggs, dairy products and meat





























టైంపాస్‌ కోసం తినే వేరుశనగతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే విటమిన్‌ బి–3 పోషకం మెదడుని చురుకుగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని వారు చెబుతున్నారు. మన మూడ్‌ బాగుండడానికి సెరటోనిన్‌ అనే రసాయనం కారణం అన్న సంగతి తెలిసిందే! వేరుశనగలోని అమినోయాసిడ్స్ ఈ రసాయనం విడుదల కావడానికి దోహద పడతాయి. దాంతో మన మానసిక స్థితి బాగుండడంతో పాటు డిప్రెషన్‌ వంటి వాటి బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు అన్నది నిపుణుల వాదన. బాగా ఒత్తిడికి లోనయిన సందర్భలోనూ, డిప్రెషన్‌కి గురైనప్పుడు గుప్పెడు వేరుశనగ పప్పు తింటే వాటి నుంచి త్వరితగతిన బయటపడవచ్చు అని వారు చెబుతున్నారు.

Groundnut is rich in protein, which makes up 26-28 per cent of its nutrient content. This is higher than in eggs, dairy products and meats; a 28 g serving of groundnuts can provide as much as 12 per cent of recommended daily protein allowance. The seeds are also rich in minerals like calcium, iron and vitamins A and B.

The seeds are 48-50 per cent oil, most of which is good fat. Some 50 per cent of the oil is monounsaturated fatty acid (MUFA) and 30 per cent polyunsaturated fatty acid (PUFA), which help lower cholesterol and are good for heart health. In India, most of the groundnut produced is used to extract oil and around 5 per cent is consumed as a snack or in recipes.

There are efforts to improve the nutrition of the nut. In 2019, researchers under the All-India Co-ordinated Research Project on Groundnut identified two peanut lines with about 80 per cent oleic acid, which is a MUFA that can help reduce the risk of cardiovascular diseases. These varieties can be used to prepare healthier oil with longer shelf life.

The oil also has commercial uses other than food and is an ingredient in soaps, beauty creams, medical ointments and creams, paints and lubricants. Groundnut oil cake is used as animal and poultry feed as well as an organic fertiliser.

In addition, groundnut leaves serve as a rich source of cattle feed, which the shell is used in manufacturing industrial products like cardboard and also as fuel.



Sunday 7 January 2018

Regu pandu

మనిషికి అవసరమైన 24 రకాల ఆమైనో ఆమ్లాలలో 18 రకాలు రేగు పండ్లలో లభిస్తాయి. ఈ పండులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. దీంతో ఆజీర్తి, కడుపుమంట, గొంతునొప్పి, అస్తమా కండరాల నొప్పి దూరమవుతాయి. చర్మ సౌందర్యం లభిస్తుంది. ఎర్ర రక్త కణాలను శుభ్రపరిచి, గుండె సంబంధిత వ్యాధులను దరి చేరనీయదు. క్యాన్సర్‌ రక్త కణాలను నిలువరిస్తుంది. కాలేయాన్ని కాపాడుతుంది. గర్భిణుల్లో వాంతులు, వికారాలను తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకి పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.
  •  రేగు చెట్టు ఆకు కషాయంతో అర్శమొలలు, భగందరం, పిషర్‌ ఉన్న వారికి ఊరట లభిస్తుంది.
  •  బెరడును ఎండబెట్టి, పొడి చేసుకొని గాయాలు, పుండ్లపై చల్లుకుంటే తగ్గుతాయి. ఆయుర్వేదంలో ఈ బెరడును డయేరియాకు ఔషధంగా వాడతారు.
  •  వేరు కషాయం నీళ్ల విరోచనాలు, జ్వరాలు, సాధారణ నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

విశిష్ట ఫలం - సంప్రదాయం పదిలం
శబరికి తోబుట్టువులా ఎంగిలి పండ్లు తిన్నా వు.. అంటు రామాయణ గాథలో భక్తరామదాసు రామచంద్రుడిని గురించి పాడిన పాట తెలిసిందే. పూర్వకాలంలో రామ భక్తురాలు అయిన శబరి శ్రీరాముడికి రుచి చూసి కొసి రి, కొసిరి తినిపించినవి ఈ బదరీ ఫలాలే. నాటి నుంచి నేడు మనం సంక్రాంతి సందర్భంగా భోగి రోజు రేగు పండ్లను పూజించ డం చూస్తే మన సాంప్రదాయంలో ఈ పం డ్లకు ఎంత ప్రత్యేకత ఉందో తెలుసోతంది.

వంద గ్రాముల రేగు పండ్లలో    పోషకాలు ఇలా..
కొవ్వు -                             0.2 గ్రాములు
కాల్షియం -                        25.6 మిల్లీ గ్రాములు
క్యాలరీలు -                       79
ప్రొటీన్లు -                         1.2 గ్రాములు
సోడియం -                      3.5 మిల్లీ గ్రాములు
పాస్ఫరస్‌ -                     26.8 మిల్లీ గ్రాములు
విటమిన్‌-ఏ -                  10 మైనో - గ్రాములు
విటమిన్‌-సీ -                 70 మిల్లీ గ్రాములు
పిండి పదార్థాలు -            20.2 గ్రాములు

Saturday 6 January 2018

Coconut oil

కొబ్బరి నూనె అనగానే కేవలం కేశాల అందాన్ని ఇనుమడింపజేయటానికే అనుకుంటాం. పగిలిన పెదవులకు ఉపశమనం కోసం, ఆహార పదార్థాల రుచిని ఇనుమడింపజేసే వంటనూనెగా వాడతారని కూడా మనకు తెలుసు. కానీ మనకు తెలియని మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరి నూనెలో దాగున్నాయి.
 కొబ్బరి నూనెలో ఉండే కొన్ని రకాల ఆమ్లాలు, ట్రైగ్లిసరైట్స్‌లు వల్ల అదనంగా 200 కెలోరీల శక్తి శరీరానికి లభిస్తుంది. దీనివల్ల శరీరంలో శక్తి ఉత్పాదకత ఐదుశాతం పెరుగుతుంది.
 హానికారక సూక్ష్మజీవులను, వైర్‌సలను నిర్మూలించే లారిక్‌ యాసిడ్‌, మోనోగ్లిజరైడ్‌లు కొబ్బరి నూనెలో అధిక పాళ్లలో ఉంటాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.
 కొబ్బరి నూనెలో ఉండే ట్రైగ్లిసరైట్లను కాలేయం జీర్ణం చేసుకొని కెటోన్లను ఉత్పత్తి చే స్తుంది. ఇవి మెదడుకు తక్షణ శక్తిని ఇస్తాయి. సొంతంగా తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో మెదడు ఉన్నప్పుడు అది విధులను నిర్వహించటానికి ప్రత్యామ్నాయ శక్తి వనరుగా ఉపయోగపడతాయి.
 కొబ్బరి నూనెలో నేచురల్‌ సాచ్యూరేటెడ్‌ ఫాట్స్‌ ఉంటాయి. ఇవి గుండె జబ్బులు తగ్గటానికి దోహదం చేస్తాయి. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి.
మతిమరుపుతో సతమతమయ్యేవారికి ట్రైగ్లిసరైట్స్‌ మరచిపోయిన విషయాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునేందుకు సహాయపడతాయని పరిశోధనల్లో రుజువైంది. అంతేకాదు ట్రైగ్లిసరైట్స్‌ను మెదడు ఇన్సులిన్‌ లేకుండానే నేరుగా గ్రహిస్తుంది. దీనివల్ల మెదడు కణాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలో ఉండే ట్రైగ్లిసరైట్స్‌ సులభంగా జీర్ణమవుతాయి. పాంక్రియాస్‌ ఎదుర్కొనే జీవక్రియల ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఆరోగ్యాన్ని దెబ్బతీసే హార్మోన్ల అసమతుల్యతను కొబ్బరినూనె నివారిస్తుంది. ఇందులో ఉండే లారిక్‌ యాసిడ్‌, ఈస్ట్రోజన్‌ హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి.
నోట్లో కొబ్బరి నూనెను పోసుకొని పుక్కిలించటం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
విటమిన్‌, క్యాల్షియం, మెగ్నీషియాలను గ్రహించటానికి కొబ్బరినూనె శరీరానికి సహకరిస్తుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు రెట్టింపు ప్రభావంతో పనిచేస్తాయి. జీర్ణాశయంలో చెడు బ్యాక్టీరియాను నిర్మూలించి, శిలీంధ్ర సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.



కొబ్బరి తీయటి కొబ్బరి నీళ్లు, మీగడలాంటి కొబ్బరి, కొబ్బరిముక్కలు, కొబ్బరి పాలు, కొబ్బరినూనె , కొబ్బరి చక్కెర..  సైతం కొబ్బరి రారాజు.  కొబ్బరిలో ఆరోగ్య లాభాలు కూడా తక్కువేమీ లేవు. అవేమిటంటే...
  • కొబ్బరి బ్రెయిన్‌ ఫుడ్‌! కొబ్బరినీళ్లు, కొబ్బరినూనెలతో స్వల్పకాలంలో డెమెన్షియా, అల్జీమర్స్‌ వంటివాటిని నిరోధించవచ్చు.
  • ఇది యాంటి-ఇన్ఫ్లమేటరీ.
  • రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందజేస్తుంది.
  • జీర్ణక్రియ బాగా జరిగేలా సహాయపడుతుంది.
  • ఫ్రీరాడికల్స్‌ లేకుండా చేసి ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌ నుంచి రక్షిస్తుంది.
  • గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
  • గుడ్‌ కొలెస్ట్రాల్‌(హెచ్‌డిఎల్‌)ను పెంచుతుంది.
  • కొబ్బరి తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ పనితీరు బాగుంటుంది.
  • కిడ్నీ జబ్బులు, బ్లాడర్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా సంరక్షిస్తుంది.
  • బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  • కొబ్బరి వాడకం వల్ల వెంట్రుకలు, చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
  • చర్మం ముడతలు పడదు. సాగదు. చర్మాన్ని సూర్యకాంతి నుంచి సైతం సంరక్షిస్తుంది.
  • కొబ్బరిలో డయటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంది.
  • మధుమేహాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
  • పొట్టచుట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
  • రోజూ 200 గ్రాముల కొబ్బరి చొప్పున పన్నెండు వారాల పాటు క్రమం తప్పకుండా తింటే బిఎంఐతో పాటు నడం చుట్టుకొలత కూడా తగ్గుతుంది.
  • శరీరంలోని ఫ్యాట్‌ను కరిగించి ఎనర్జీని పెంచుతుంది.
  • శరీరాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
  • పాలలో కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషకవిలువలు, ఆరోగ్య సుగుణాలు అధికంగా ఉన్నాయి. 
  • మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
  • బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ని పెంచి గుండెజబ్బులు రాకుండా తగ్గిస్తుంది.
  • ఎసిడిటీ, గుండెల్లో మంటలను నిరోధిస్తుంది.
  • ఎన్నో పోషకవిలువలు ఉన్న కొబ్బరినీళ్లు గర్భిణీలకు చాలా మంచిది. కడుపులోని బిడ్డతో పాటు తల్లికి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • రోజూ కొబ్బరి తినడం వల్ల ఎముకలు పటిష్టంగా పెరగడంతో పాటు దంతాలు దృఢంగా తయారవుతాయి.
  • చర్మంలోని పొడారిపోయే గుణాన్ని కొబ్బరి నూనె నిరోధిస్తుంది.
  • కొబ్బరి వాడకం వల్ల శరీరంలోని విషపదార్థాలు శుభ్రం కావడంతో పాటు చర్మం పై పొరలోని ఫంగస్‌, బ్యాక్టీరియాలు అచేతనమవుతాయి.
  • కొబ్బరి తినడం వల్ల చర్మ కాన్సర్‌ రిస్కు తగ్గుతుంది.
  • రోజూ కొబ్బరి తినడం వల్ల చర్మంలో ఆక్సిజన్‌ పాళ్లు పెరిగి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. టానింగ్‌ను తగ్గిస్తుంది.
  • జిడ్డు చర్మంపై కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్‌ని పోగొట్టడం వల్ల చర్మం టోనింగ్‌ సమతుల్యంగా ఉంటుంది.
  • చక్కెర, కొబ్బరి నూనె కలిపి శరీరానికి స్క్రబ్బర్‌గా వాడొచ్చు.
  • స్వచ్ఛమైన కొబ్బరినూనె వాడడం వల్ల జుట్టు రాలదు. కొబ్బరినీళ్ల వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. కొబ్బరిలోని యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటి- ఫంగల్‌ సుగుణాలు తలలో చుండ్రు, పేలు చేరడాన్ని నిరోధిస్తుంది.

medipallu

మేడి పండ్లను నీడన ఎండించి చేసిన చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి, 10 గ్రాముల చొప్పున ప్రతి రోజూ సేవిస్తూ ఉంటే, రక్తదోషాలు తొలగిపోతాయి. రక్తశుద్ధి, రక్తవృద్ధి కలిగి చ ర్మం కాంతివంతమవుతుంది.
మేడిపండ్ల చూర్ణాన్ని ప్రతి రాత్రి పడుకునే ముందు రెండు స్పూనులు సేవిస్తే మలబద్ధత తొలగిపోతుంది. లేదా తరుచూ మేడిపండ్లను తింటూ ఉన్నా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
60 గ్రాముల మేడి బెరడును నలగగొట్టి, 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత వడబోసి అందులో ఒక స్పూను తేనె కలిపి ప్రతిరోజూ పరగడుపున సేవిస్తూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది
60 మి. లీ మేడి పండ్ల రసంలో అరస్పూను కరక్కాయ పొడి కలిపి ప్రతి రోజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది.
మేడిచెట్టు బెరడు చూర్ణానికి సమంగా పటిక బె ల్లం కలిపి, తులం మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తూ ఉంటే, తెల్లబట్ట సమస్య పోవడంతో పాటు పలురకాల గర్భాశయ వ్యాధులు నయమవుతాయి.
50 - 60 మి. లీ మేడిపండ్ల రసంలో కొద్దిగా తేనె చేర్చి సేవిస్తూ, పాల అన్నం మాత్రమే తింటూ ఉంటే అధిక రకస్రావ సమస్య తొలగిపోతుంది.
10 గ్రాముల మేడి పండ్ల రసాన్ని గానీ, 60 మి. లీ బెరడు కషాయాన్ని గానీ, 40 రోజుల పాటు క్రమం తప్పకుండా సేవిస్తే, అతి మూత్ర వ్యాధితో పాటు, మూత్రంలో రక్తం పడటం కూడా తగ్గుతుంది.
 మేడి చెట్టు జిగురుకు నాలుగు రెట్లు చక్కెర కలిపి 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా సేవిస్తూ ఉంటే అధిక వేడి తగ్గుతుంది.
250 మి. లీ చెక్క కషాయంలో 3 గ్రాముల పొంగించిన పటిక చూర్ణం కలిపి రోజుకు మూడు పూటలా పుక్కిలిస్తూ ఉంటే నోటి అల్సర్లు మానిపోతారు.