Sunday 28 January 2018

jalubu taggataniki

గోరువెచ్చగా ఉండే ఫ్లూయిడ్లు తీసుకుంటే శరీరానికి ఎంతో సాంత్వనగా ఉంటుంది. వేడి ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన నెమ్ము కరుగుతుంది.
వెల్లుల్లి లేదా అల్లం వేసి తయారుచేసిన కాయగూరల సూప్‌ను వేడిగా తాగితే మంచిది. దీని వల్ల ఊపిరితిత్తుల్లోని శ్లేష్మం తగ్గుతుంది.
ఆర్గానిక్‌ బెల్లం, అల్లం రసం చుక్కలు, కచ్చాపచ్చాగా చేసిన నల్ల మిరియాల పొడి, పిప్పలి (లాంగ్‌ పెప్పర్‌) వేడి నీళ్లల్లో వేసి తాగితే ఊపిరితిత్తులకు మంచిది.
పసుపులో ఉండే కుర్‌క్యుమిన్‌ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తాజా పసుపు వేళ్ల నుంచి తీసిన రసాన్ని వేడి సూప్స్‌లో కలుపుకుని తాగితే మంచిది.
ఉల్లిపాయరసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగినా లేదా పచ్చిఉల్లిపాయమీద నిమ్మరసం పిండుకుని తిన్నా ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం కరిగిపోతుంది.
ఒక కప్పు వేడినీళ్లల్లో టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపి తాగితే కూడా నెమ్ము పోతుంది.
కృత్రిమమైన, రసాయన ఆరోమా స్ర్పేలను ఇంట్లో పెట్టొద్దు.

No comments:

Post a Comment