ఈజిప్ట్లో బ్రహ్మజెముడు పండును ‘పేదవారి పండు’ అని కూడా పిలుస్తుంటారు. అక్కడ ఇది బాగా చౌకగా లభించడమే దీనికి కారణం.
ట్యునీషియాలో దీన్ని 'సుల్తాన్ ఘాలా' (పంటల్లో రాజు) అని కూడా అంటారు.
బ్రహ్మజెముడు పండులో ఎన్నో ఔషధ, పోషకాహార గుణాలు ఉన్నాయి.
ఇటీవల, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రచురించిన ఓ అధ్యయనంలో.. యాపిల్స్, టమోటాలు, అరటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కంటే ఈ పండులో రెండింతలు అధికంగా ఉంటుందని పేర్కొంది.
విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్, బెటాలైన్స్ ఈ పండులో పుష్కలంగా ఉంటాయని వెల్లడించింది.
బ్రహ్మజెముడు పండులో ఉండే పోషక పదార్థాలు కరోనరీ ఆర్టరీ డిసీజ్ (గుండెకు సంబంధించిన వ్యాధి) ముప్పు తగ్గించడమే కాకుండా.. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఈ పండులో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
క్రమం తప్పకుండా ఈ పండును తింటే రక్త కణాల పనితీరు మెరుగవుతుంది.
యూఎస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం.. బ్రహ్మజెముడు పండులో పొటాషియం ఎక్కువగా ఉండి, సోడియం తక్కువగా ఉంటుంది.
కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇదెంతో ఉపయోగకరం.
కొన్ని ప్రాంతాల్లో వందల ఏళ్లుగా బ్రహ్మజెముడు పండును ఒక సంప్రదాయ ఔషధంగా వాడుతున్నారు.
విటమిన్ సీ లోపం వల్ల కలిగే ఇబ్బందులు, డయాబెటిస్ వంటి సమస్యలకు అందించే చికిత్సల్లో ఈ పండును వాడుతున్నారు.
బ్రహ్మజెముడు పండుతో ఇతర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
పేగులు, కిడ్నీలు, కాలేయం, బ్లాడర్ను శుభ్రపరిచే గుణాలు ఈ పండులో ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థ, గుండె, మానసిక ఆరోగ్యంపై కూడా బ్రహ్మజెముడు పండు సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పోషకాహార నిపుణులు చెప్పారు.
No comments:
Post a Comment