Monday 7 August 2017

Biryani leaf or Bayleaf





బిరియానీ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. మధుమేహం నియంత్రణలో ఉండానికి బిరియానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. మధుమేహుల్లో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బేలీఫ్‌ ఎక్స్‌ట్రాని నీళ్లలో కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. బిరియానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడడం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు. దీనిలో కేన్సర్‌ నిరోధక కారకాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కేన్సర్‌ కారకాల ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకనే మసాలా దినుసులు ఎక్కువగా ఉండే బిర్యానీలో దీన్ని వాడుతుంటారట. తద్వారా మసాలా ఎక్కువవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పొచ్చట. 

Sunday 6 August 2017

Water Lilies





Water lilies grow widely across India, and have a nutritional value that many are unaware of, says ecologists.  “Where water lilies grow wild, like in Bengal after the monsoon, people prefer to eat the peduncle (flower stalk),” she says. “Both red and white varieties are eaten: to prep, peel the stalk and cut into 2-inch pieces. This can be batter-fried like pakoda. If very fresh, boil it with a little bit of water and a pinch of salt and turmeric till cooked. Temper mustard oil, mustard seeds and green chilli, add the stalk, adjust salt, and finish with fresh grated coconut. Another way of cooking them is to temper 1 tbsp ginger, radhuni (Trachyspermum roxburghianum) and mustard paste, green chilli, salt and a pinch of sugar and add the stalks.”
Pick it right: Source them from farmer’s markets and try to ensure that they are from a clean water source.

Ayurvedic herbs for issueless people

ఆయుర్వేద చికిత్స 
సంతానలేమిని ఆయుర్వేదంలో వంధ్యత్వమని పేర్కొన్నారు. పురుషుల్లో సంతానలేమిని శుక్ర దోషాలుగా చెప్పవచ్చు. వీర్యకణాలను పెంచే అద్భుతమైన ఔషధాలు ఎన్నో ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్నారు. శృంగార సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాజీకరణ ఔషధాలు ఉన్నాయి. శుక్ర దోషాలను 8 రకాలుగా చెప్పారు. ఇవి వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాల వల్ల ఏర్పడతాయని ఆయుర్వేదశాస్త్రంలో వివరించారు.
వాజీకరణ ఔషధాలు 4 రకాలు ఉన్నాయి.
1. శుక్ర జనకాలు: ఇవి వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. వీటిలో అశ్వగంధ, శతవరి, జీవకం మొదలైనవి ఉన్నాయి.  
2. శుక్ర ప్రవర్తకాలు: ఇవి వీర్యాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తాయి. వీటిలో బృహతి, కంటకారిలను పేర్కొనవచ్చు. 
3. శుక్ర జనక, ప్రవర్తకాలు: వీటిలో జీడిపప్పు, మినుములు, పాలు చెప్పవచ్చు. 
4. శుక్ర బోధకాలు: వీర్యంలోని దోషాలను నివారించేవి. వీటిలో కోకిలాక్ష, కూష్మాండ, ఉసిర, చెరకు రసం చెప్పవచ్చు.
పురుషుల వీర్యంలో ఎలాంటి లోపాలున్నా ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చు. ఔషఽధాలతో పాటు మానసిక ఆందోళనలను తగ్గించుకొని, ఆహారం, వ్యాయామం విషయంలో శ్రద్ధ వహించాలి. సంతాన, శృంగార సమస్యలపై అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా ఔషధాలు వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.

korra biyyam

కొర్రబియ్యం లేదా కొర్రలు
చిరుధాన్యాలుగా పిలవబడే ఈ కొర్రలు అతి ప్రాచీణ కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి తప్పా పట్టణ వాసులకు పెద్దగా తెలియదు. కానీ ప్రస్తుతం నగరంలోని చాలా దుకాణాల్లో కొర్రలను విక్రయిస్తున్నారు. వీటి నాణ్యతను బట్టి కిలో రూ.70 నుంచి రూ.120 వరకూ ధర పలుకుతుంది. ఈ కొర్రల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నందున ఇప్పుడు చాలామంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొర్రలను అన్నం మాదిరిగానే వండుకుని తింటారు. బియ్యాన్ని వండిన విధానంలోనే కొర్రలనూ వండుతారు. అయితే వండడానికి సుమారు రెండు గంటల ముందు వీటిని నానబెడతే సరిపోతుంది.
 
పీచు పదార్థం కలిగి వుండే కొర్రల్లో ఐరన్‌, కాల్షియం, మాంసకృత్తులు, థైమిన్‌, రిబోఫ్లావిన్‌ వంటి పోషక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇవి డయాబెటిస్‌ రోగులకు మంచి ఔషధం. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అజీర్తి సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. కొర్రలు వినియోగంతో జీర్ణనాళం శుభ్రం కావడంతో పాటు యూరినల్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యలను దూరం చేస్తుంది... ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అంతేకాక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలు కొర్రలులో ఉన్నందునే వీటి వినియోగానికి నగరవాపులు ఎక్కువ ఎక్కువ చూపుతున్నారు

Dampudu biyyam

దంపుడు బియ్యం
సాధారణంగా ధాన్యాన్ని మిల్లులకు పంపించడం ద్వారా బాయిల్డ్‌ రైస్‌, పాలిషింగ్‌ రైస్‌లు మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ తరహా పాలిషింగ్‌ పక్రియలో బియ్యంలో గల చాలా పోషక పదార్థాలు తొలగిపోతాయి. చూడడా నికి అందంగా కనిపించే ఈ వైట్‌ రైస్‌తో పోలిస్తే దంపుడు బియ్యంలో చాలా పోషక విలువలున్నాయి.
 
ధాన్యాన్ని యాంత్రికంగా కాకుండా సాధారణ పద్ధతిలో వడ్లను రోకలితో దంచడం ద్వారా లభించే బియ్యమే ఈ దంపుడు బియ్యం. దీన్నే ముడిబియ్యం లేదా బ్రౌన్‌ రైస్‌ అంటారు. పీచు (ఫైబర్‌), కార్బోహైడ్రేట్స్‌, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఈ బియ్యాన్ని అన్నంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యకు చెక్‌ చెబుతుంది. సాధారణ పాలిష్డ్‌ బియ్యం తినేవారితో పోలిస్తే దంపుడు బియ్యం తినేవారికి వెంటనే ఆకలి వేయదు. దంపుడు బియ్యంతో వండే అన్నాన్ని తినడం వల్ల గుండెజబ్బులు, రొమ్ము కేన్సర్‌ వంటి వ్యాధుల బారినపడకుండా ఉండవచ్చు. సాధారణ రైస్‌ ధరకే ఈ దంపుడు బియ్యం కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో దంపుడు బియ్యం రూ.50 నుంచి లభిస్తున్నాయి.

Wednesday 2 August 2017

Karakkaya

కరక్కాయ చూర్ణం ఒక భాగం, వేయించిన పిప్పళి చూర్ణం సగభాగం కలిపేయాలి. అందులోంచి ఒక గ్రాము చూర్ణాన్ని తేనెతో ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున సేవిస్తే కోరింత దగ్గు తగ్గిపోతుంది.
పసుపు కొమ్ము రసాన్ని ఇనుప పాత్రలో ఉంచి వేడిచేస్తూ, కరక్కాయ కల్కాన్ని చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం లేపనంగా వేస్తే ‘గోరు చుట్టు వాపు ’రోగం శమిస్తుంది.
ఒకటి రెండు చెంచాల కరక్కాయ పొడిని భోజనానికి ముందు మజ్జిగతో సేవిస్తే స్థూలకాయం తగ్గుతుంది.
కరక్కాయ చూర్ణాన్ని తేనెతో సేవిస్తే విషజ్వరాలు తగ్గుతాయి.
కాస్తంత కరక్కాయ చూర్ణాన్ని, 3 గ్రాముల తేనెతో రోజూ రెండు పూటలా సేవిస్తూ, ఉప్పు, కారం, మసాలాలు లేని చప్పిడి ఆహారం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
కరక్కాయ చూర్ణంలో కొంచెం బెల్లం కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తే ర క్త మొలలు హరిస్తాయి.