Friday 2 June 2017

ఖర్జుర పండు

ఖర్జూరాల్లో సల్ఫర్‌ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలు, సైనస్‌లతో బాధపడే వాళ్లకు ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు. ఖర్జూరాల్లో చక్కెరలు, ప్రోటీన్లు, విటమిన్లు, సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తక్కువగా ఉండే వారికి పుష్టినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి. ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గ పనిచేసేలా చేస్తుంది. అందుకు వయసు రీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
 
గుండె బలహీనంగా ఉండే వాళ్లు రాత్రి పూట ఎండు ఖర్జూరాన్ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్టు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హుద్రోగాలను రాకుండా చేస్తాయి. ఖర్జూరాలు లైంగిక శక్తికి దోహదం చేస్తాయి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకుల పొడి, జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు. దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడే వాళ్లు ఖర్జూర పండ్లు తింటే వాటిల్లోని పొటాషియం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
దంతాల మీద ఎనామిల్‌ను సంరక్షించడంలో ఖర్జూరాలను మించింది లేదు. నిజానికి ఎనామిల్‌ ఎముక కన్నా దృఢమైన హైడ్రాక్సీ ఎపటైట్స్‌ అనే పదార్థాలతో రూపొందుతుంది. ఆహారంలో ఉండే బాక్టీరియా కారణంగా ఎనామిల్‌ క్రమంగా తగ్గిపోతుంది. అదే ఖర్జూరాల్ని రోజూ తినడం వల్ల అందులోని ఫ్లోరిన్‌ దంతాల మీద పాచి చేరకుండా చూడటంతో పాటు ఎనామిల్‌తో చర్య పొంది హైడ్రాక్సీఫ్లోరో ఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.
 
పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఖర్జూర పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట, కాలేయ, మూత్ర నాళ, క్లోమ, అండాశయ, క్యాన్సర్లు రావని, వచ్చినా వాటిని నివారించే శక్తి ఈ పండ్లకు ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వారానికి మూడు సార్లు ఖర్జూరాలు తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఎడారి ఫలాల్లో సెలీనియం, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియం, వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఖర్జూరాల్లోని నికోటిన్‌ పేగుకు సంబంధిం చిన వ్యాధులను రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బాక్టీరియా పెరిగేలా చేయడానికి ఖర్జూరాల్లోని అమైనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఊతమిస్తాయి. ఐరన్‌ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు రక్తహీనత, అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి.
 
గర్భిణీలకు ఎంతో మేలు
రోజుకో ఖర్జూరపండు తింటే కళ్లకు మంచిది. ఇందులో ఉండే ఏ విటమిన్‌ రేచీకటిని నివారిస్తుంది. గర్భిణిలకు ఎడారి ఫలాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచిం చేలా చేయడంతో పాటు బిడ్డ పుట్టాక పాలు పడేందుకు కారణమవుతాయి. గర్భస్త శిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్‌ పాలీఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, పోట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి.

No comments:

Post a Comment